మీడియా ప్రతినిధుల గుర్తింపు ప్రక్రియను మరింత పారదర్శకంగా, వేగవంతంగా మరియు సురక్షితంగా మార్చేందుకు నెల్లూరు ఎస్పీ డా. అజిత వెజెండ్ల, సరికొత్త విధానానికి శ్రీకారం చుట్టారు. ఇందులో భాగంగా క్యూఆర్ కోడ్ ( ) ఆధారిత స్మార్ట్ మీడియా అక్రిడిటేషన్ వ్యవస్థను ప్రారంభించారు.
ఈ విధానం ద్వారా ప్రత్యేక క్యూఆర్ కోడ్ డిజిటల్ పాస్ ద్వారా జర్నలిస్టుల వివరాలను కేవలం క్షణాల్లో ధృవీకరించే సదుపాయం కల్పించారు.
నకిలీలకు అడ్డుకట్ట
ఈ సరికొత్త డిజిటల్ పాస్ల ద్వారా అసలైన జర్నలిస్టు ఎవరో సులభంగా గుర్తించవచ్చు, దీనివల్ల నకిలీ మీడియా పాస్లకు పూర్తిస్థాయిలో అడ్డుకట్ట పడనుంది.
ప్రత్యేక రిజిస్ట్రేషన్ కార్యక్రమం
మీడియా మిత్రుల అభ్యర్థన మేరకు సోమవారం నాడు నెల్లూరులోని ఉమేష్ చంద్ర కాన్ఫరెన్స్ హాల్లో ప్రత్యేకంగా క్యూఆర్ కోడ్ రిజిస్ట్రేషన్ కార్యక్రమాన్ని నిర్వహించనున్నట్లు ఎస్పీ తెలిపారు.
తిరుపతిలోనూ అమలు
ఇదే తరహా స్మార్ట్ మీడియా అక్రిడిటేషన్ విధానాన్ని త్వరలోనే తిరుపతిలోనూ ప్రారంభించనున్నట్లు సమాచారం.












