కాజీపేట్, 2026-08-15
దేశ 80వ స్వాతంత్ర్య దినోత్సవాన్ని పురస్కరించుకుని కాజీపేటలో వివిధ కార్మిక సంఘాల ఆధ్వర్యంలో ఘనంగా జాతీయ పతాకావిష్కరణ కార్యక్రమాలు నిర్వహించారు. మండల యూనియన్ గౌరవ అధ్యక్షులు మైసరపు సీరిల్ లారెన్స్ ముఖ్య అతిథిగా పాల్గొని పలుచోట్ల జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు.
దేశ 80వ స్వాతంత్ర్య దినోత్సవాన్ని పురస్కరించుకుని కాజీపేటలో వివిధ కార్మిక సంఘాల ఆధ్వర్యంలో ఘనంగా జాతీయ పతాకావిష్కరణ కార్యక్రమాలు నిర్వహించారు. మండల యూనియన్ గౌరవ అధ్యక్షులు మైసరపు సీరిల్ లారెన్స్ ముఖ్య అతిథిగా పాల్గొని పలుచోట్ల జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు.
వివిధ సంఘాల ఆధ్వర్యంలో వేడుకలు
మొదటగా కాజీపేట చౌరస్తాలో పెయింటర్ యూనియన్ ఆధ్వర్యంలో, అనంతరం కాజీపేట కూరగాయల మార్కెట్ మెయిన్ రోడ్ చౌరస్తాలో ప్రైవేట్ ఎలక్ట్రిషన్ యూనియన్ ఆధ్వర్యంలో, తర్వాత బాపూజీనగర్ మెయిన్ రోడ్డు చౌరస్తాలో ట్రైసిటీ ఆటో యూనియన్ ఆధ్వర్యంలో నిర్వహించిన జెండా ఆవిష్కరణ కార్యక్రమాల్లో ఆయన పాల్గొన్నారు. అలాగే జంభవ సంక్షేమ సంఘం మరియు తేజోమయ మాల కుల సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో నిర్వహించిన స్వాతంత్ర్య దినోత్సవ వేడుకల్లో ముఖ్యఅతిథిగా హాజరయ్యారు.
స్వాతంత్ర్య సమరయోధుల త్యాగాలు స్మరణ
ఈ సందర్భంగా మైసరపు సీరిల్ లారెన్స్ మాట్లాడుతూ, స్వాతంత్ర్యం సాధించి 80 సంవత్సరాలు పూర్తిచేసుకున్న ఈ చారిత్రాత్మక వేళ ప్రతి భారతీయుడికి హృదయపూర్వక స్వాతంత్ర్య దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. దేశ స్వేచ్ఛ కోసం తమ ప్రాణాలను అర్పించిన మహాత్మా గాంధీ, నేతాజీ సుభాష్ చంద్రబోస్, భగత్ సింగ్, అల్లూరి సీతారామరాజు, సర్దార్ వల్లభభాయ్ పటేల్తో పాటు ఎందరో అమరవీరుల త్యాగాలను ఈ సందర్భంగా స్మరించుకోవాలని పిలుపునిచ్చారు.
దేశాభివృద్ధిలో కార్మికుల పాత్ర
వారి త్యాగాల ఫలితంగానే నేడు మనం స్వేచ్ఛా వాతావరణంలో జీవిస్తున్నామని, దేశ సమైక్యత, రాజ్యాంగ విలువలు, జాతీయ జెండా గౌరవాన్ని ప్రతి పౌరుడు కాపాడాల్సిన బాధ్యత ఉందని అన్నారు. దేశాభివృద్ధిలో కార్మికుల పాత్ర ఎంతో కీలకమని, ఐకమత్యంతో ముందుకు సాగుతూ అభివృద్ధి చెందిన భారత నిర్మాణానికి ప్రతి ఒక్కరూ తమ వంతు సహకారం అందించాలని కోరారు.
సంక్షేమ పథకాల అమలుపై ఆశాభావం
రాష్ట్ర ప్రభుత్వం త్వరలో అమలు చేయనున్న స్మార్ట్ రేషన్ కార్డుల ద్వారా నిజమైన అర్హులందరికీ సంక్షేమ పథకాల ప్రయోజనాలు మరింత పారదర్శకంగా అందుతాయని ఆశాభావం వ్యక్తం చేశారు. ప్రతి పేద కుటుంబానికి ప్రభుత్వ సంక్షేమ ఫలాలు చేరేలా చర్యలు కొనసాగాలని కోరారు.
ఎమ్మెల్యే నాయిని రాజేందర్ రెడ్డి హామీపై ప్రశంస
అలాగే, వరంగల్ పశ్చిమ ఎమ్మెల్యే నాయిని రాజేందర్ రెడ్డి వైఎస్సార్ గుడిసెవాసులకు అండగా నిలుస్తూ, వారికి శాశ్వత నివాస స్థలాలు కల్పించేందుకు కృషి చేస్తామని, కాంగ్రెస్ పార్టీ పూర్తి స్థాయిలో తోడ్పాటునందిస్తుందని హామీ ఇవ్వడం పట్ల హర్షం వ్యక్తం చేశారు. పేదల సంక్షేమమే లక్ష్యంగా నాయిని రాజేందర్ రెడ్డి చేస్తున్న కృషితో వైఎస్సార్ గుడిసెవాసుల్లో నూతన ఆశలు చిగురించాయని, వారు సంతోషంగా ఉన్నారని పేర్కొన్నారు.












